ఊరడి యాదయ్య అంత్యక్రియలకు ఆర్థిక చేయూత
Published: Wednesday September 21, 2022
పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజా పాలన : గ్రామంలో ఎవరు మరణించినా అంత్యక్రియలకు మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత అందిస్తానని పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో ఊరడి ఎల్లయ్య కుమారుడు ఊరడి యాదయ్య (56) అనారోగ్యంతో మృతి చెందిన సమాచారాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశానని వివరించారు. కుటుంబంలో ఎవరు మరణించిన వెంటనే సమాచారాన్ని గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవ రెడ్డికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భర్త చంద్రయ్య మాజీ ఎంపీటీసీలు భాస్కర్ వెంకటయ్య గ్రామపంచాయతీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: