కరోనా భాదితులకు పరమేశ్వరి జ్యూయలర్స్ అధినేత కోడిగుడ్లు పంపిణీ

Published: Monday May 31, 2021
మధిర, మే 30, ప్రజా ప్రతినిధి : మధిర మండలం ఈరోజు మధిర మండలం ఆత్కూరు గ్రామంలో వృద్ధులకు, మరియు  కరోనా జ్వరాలతో బాధపడుతున్న వారికి మధిర కన్యకా పరమేశ్వరి జ్యులరీ షాపు యజమాని మైలవరపు వీరభద్ర రావు, గారి కుమార్తె ఆర్థిక సహాయంతో, మధిర మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, దారా బాలరాజు ఆధ్వర్యంలో, ఇంటింటికి తిరుగుతూ, కరోనా వ్యాధి పట్ల, ధైర్యం చెప్తూ, వారి ఇమ్మ్యూనిటి కోసం, ప్రతి ఒక్కరికి కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా దారా బాలరాజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ, తప్పనిసరిగా మాస్కు ధరించాలని, శానిటైజర్తో కానీ, సబ్బుతో గాని, శుభ్రంగా చేతులు కడుక్కోవాలి అని, అలాగే, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, వారు కోరారు. ఈ కార్యక్రమంలో, గ్రామ కాంగ్రెస్ నాయకులు కంభంపాటి రవికుమార్, కంచ పోగు లాజర్, కే వీరయ్య, ఏసుపాదం, బుల్లయ్య, నాగయ్య, పుల్లయ్య, భాస్కర్ రావు, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.