హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమం..

Published: Saturday December 18, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి: కేంద్రమంత్రిత్వ శాఖ అధ్వర్యంలో నడుస్తున్న హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమాన్ని ఎర్రుపాలెంలో ప్రతిభ విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు. సామాజిక సేవా, మానవత్వ విలువలు పెంపొందించే హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమాన్ని మా పాఠశాలలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆ పాఠశాల కరస్పాడెంట్ సామినేని గిరి ప్రసాద్ గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ కోట రాకేష్ మాట్లాడుతూ హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ అడపా సంజీత్ నాయుడు ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తానమని తెలిపారు.అలాగే ఈ శిక్షణ వలన విద్యార్థులకు క్రమశిక్షణ, మానసిక శారీరక దృఢత్వంతో పాటు, మానవత్వ విలువలు, దేశ భక్తిని పెంపొందించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో‌ పాల్గొనే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ వర్తిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందుస్తాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్కౌట్ మాస్టర్స్ పోలబోయిన అభినవ్, కొత్తపల్లి.అజీత్ కుమార్, కొత్తపల్లి.కోటేశ్వరరావు, బొబ్బిళ్ళపాటి కృష్ణారావు, బోడేపల్లి మహేష్, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు..