ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి కార్పొరేటర్ చేతన హరీష్

Published: Saturday August 27, 2022
మేడిపల్లి, ఆగస్టు26 (ప్రజాపాలన ప్రతినిధి)
హబ్సిగూడ డివిజన్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ పేర్కొన్నారు.  డివిజన్ను గ్రీన్ బెల్ట్ గా ఆధునీకరించడానికి యబిడి డైరెక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి కార్పొరేటర్ డివిజన్లో పర్యటించారు. రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణలో బాగంగా మొక్కల పెంపకం,గ్రీన్ హిల్స్ కాలనీలో గ్రీన్ బెల్ట్ ఆధునీకరణ, రామంతాపూర్ టీవి స్టూడియో దగ్గర మొక్కల పెంపకం గురించి డివిజన్లో పర్యటించారు. కార్పొరేటర్ డివిజన్లో మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుబిడి నర్సింహ్మ, నర్సింగ్ రావు, టిపియస్ మౌనిక, డియి నాగమణి, ఎయి కీర్తీ శ్రీ,బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పటేల్, హేమంత్ మూలే,స్థానికులు  సిజే రెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.