ఉప్పల్ ప్రెస్ క్లబ్ శాశ్వత భవనానికి కృషి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Friday July 22, 2022
మేడిపల్లి, జూలై21 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్  ప్రెస్ క్లబ్ శాశ్వత భవనానికి కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా        ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజ్గిరి ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ పోలీస్ స్టేషన్  సిఐ గోవింద్ రెడ్డి పాల్గొని ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఉప్పల్ ప్రెస్ క్లబ్లో పాత్రికేయ మిత్రులకు తెరాసా సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్  అధ్వర్యంలో జర్కిన్లు (రెయిన్ కోట్)లను ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఏసిపి నరేష్ రెడ్డి, సిఐ గోవిందా రెడ్డి, ట్రాఫిక్ సిఐ పార్ధా సారథి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి.వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎం. సురేష్ కుమార్, పి సాగర్, 
ఏ.వి. శ్రీధర్ రావు, కోశాధికారి ఆర్ యాదగిరి గౌడ్, కార్యనిర్వాహక  కార్యదర్శులు ఎం అశోక్, సంయుక్త కార్యదర్శులు జి.శివాజీ, గుత్తి శేఖర్, సలహాదారులు కె. చంద్రమౌళి, డి.సురేష్, పల్లా మహేందర్ రెడ్డి, కే. రాజు, శ్రీశైలం,
కే. శ్రీనివాస్, వి కిషోర్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నల దేవేందర్ రెడ్డి, తెరాసా సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బాన్నాల ప్రవీణ్ ముదిరాజ్,ఉప్పల్ డివిజన్ తెరాసా పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.