తీన్మార్ మల్లన్నకి సైనికులవలె వెన్నంటే వుండాలి
Published: Wednesday August 04, 2021
కోరుట్ల, ఆగష్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన తీన్మార్ మల్లన్న సభకు కోరుట్ల పట్టణం నుండి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న బి.ఆర్.అంబెడ్కర్ ఆశయ సాధనలో నడుస్తూ, ప్రజలను చైతన్యం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే గొంతుగా నిలబడ్డ తీన్మార్ మల్లన్నకు సైనికులుగా వెన్నంటే ఉంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీమ్ కోరుట్ల నియోజకవర్గం కన్వీనర్ అలాల రాజేష్, కో కన్వీనర్ బాణాలు శ్రీధర్, కార్యకర్తలు తరి రాజశేఖర్, అల్లే రాజేశం, బోయినపల్లి మహిపాల్, కాశెట్టి సాయి వికాస్, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ నషీర్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: