తీన్మార్ మల్లన్నకి సైనికులవలె వెన్నంటే వుండాలి

Published: Wednesday August 04, 2021
కోరుట్ల, ఆగష్టు 03 (ప్రజాపాలన ప్రతినిధి) : కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన తీన్మార్‌ మల్లన్న సభకు కోరుట్ల పట్టణం నుండి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీన్మార్‌ మల్లన్న బి.ఆర్‌.అంబెడ్కర్‌ ఆశయ సాధనలో నడుస్తూ, ప్రజలను చైతన్యం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే గొంతుగా నిలబడ్డ తీన్మార్‌ మల్లన్నకు సైనికులుగా వెన్నంటే ఉంటామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తీన్మార్‌ మల్లన్న టీమ్‌ కోరుట్ల నియోజకవర్గం కన్వీనర్‌ అలాల రాజేష్‌, కో కన్వీనర్‌ బాణాలు శ్రీధర్‌, కార్యకర్తలు తరి రాజశేఖర్‌, అల్లే రాజేశం, బోయినపల్లి మహిపాల్‌, కాశెట్టి సాయి వికాస్‌, మొహమ్మద్‌ అలీ, మొహమ్మద్‌ నషీర్‌, తదితరులు పాల్గొన్నారు.