పార్టీ సభ్యత్వంతో కార్యకర్తకు భరోసా

Published: Thursday February 25, 2021

15వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 ( ప్రజాపాలన ) : పార్టీ ప్రతిష్ఠకు కార్యకర్తలు పునాదిరాళ్ళని 15వ వార్డు కౌన్సిలర్ చిట్యాల అనంత్ రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో ఎన్నేపల్లిలో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ అఫ్జల్ పాష (షకీల్) ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వంతో కార్యకర్తకు కొండంత అండగా ఉంటుందని తెలిపారు. సాధారణ కార్యకర్త రూ.30, క్రియాశీలక కార్యకర్త 100 రూపాయల సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించుకోవాలని వివరించారు. ప్రతి కార్యకర్త సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అనుకోని సంఘటన ద్వారా కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబానికి రెండు లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని చెప్పారు. ఎన్నేపల్లి ప్రజలు సభ్యత్వం తీసుకోడానికి దండులా కదలడం విశేషమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్నే పల్లి గ్రామ ప్రజలు మహమ్మద్ రుక్మొద్దిన్, ఎస్ఎంసి చైర్మన్ పెంటల మల్లేష్, జి.బాలరాజు, సి. జంగయ్య, మహమ్మద్ షరీఫ్, వి.సూరి, నర్సయ్య, సి. బుచ్చయ్య, అశోక్, వి. కృష్ణ, బి బందయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.