దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల బృంద పర్యటన

Published: Saturday September 24, 2022
హైదరాబాద్ 22 సెప్టెంబర్ ప్రజాపాలన: జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు సెంట్రల్ 
నేషనల్ క్వాలిటీ అష్యూరన్స్ స్టాండర్డ్స్ టీం జనగాం జిల్లా లో 22 మరియు 23 తేదీ లలో పర్యటించనున్నారు.
జనగాం జిల్లా దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేషనల్ క్వాలిటీ అష్యూరన్స్ స్టాండర్డ్స్ టీం  
జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు బృందం 
శ్రీమతి స్వాతి లక్ష్మి మరియు డాక్టర్ కల్పన లు పర్యటించారు.
జిల్లాలోని పలు ఆసుపత్రి లను పరిశీలించి ఆరు విభాగాల్లో స్కోర్ రికార్డు చేయడం జరిగిందని తెలిపారు.జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలు సెంట్రల్ టీం స్కోర్ ఆధారంగా సంబంధిత ఆసుపత్రి లకు అవార్డులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. జనగాం జిల్లా లో ఇప్పటి వరకు మూడు ఆసుపత్రి లకు అవార్డు లు దక్కాయని స్థానిక వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తాల్క తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కరుణశ్రీ,, డిడిఓ డాక్టర్ భాస్కర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.అశోక్, స్టేట్ క్వాలిటీ కన్సల్టెంట్ సురేష్, జిల్లా క్వాలిటీ మేనేజర్ స్రవంతి, సూపర్ వైజర్ లు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.