గాంధీని అవమానపరిచిన వారిని వెంటనే శిక్షించాలి
Published: Thursday October 06, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 04, ప్రజాపాలన: గాంధీని అవమానపరిచిన వారిని వెంటనే శిక్షించాలని వైశ్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీని కలకత్తాలో హిందూ మహాసభ పేరిట ఏర్పాటు చేసిన మండపంలో దుర్గామాత విగ్రహం వద్ద మహిషాసురుని స్థానంలో మహాత్ముని పోలిన బొమ్మను ఉంచడం సరికాదని అన్నారు, ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ముక్త శ్రీనివాస్, ఆవోప సిరిపురం శ్రీనివాస్, మాదంశెట్టి సత్యనారాయణ, కొండ చంద్రశేఖర్ , పట్టణ దొంతుల ముఖేష్ ,వాసవి కంభంపాటి కమలాకర్ , కేశెట్టి వంశీకృష్ణ ,సాయిని సత్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.
Share this on your social network: