గాంధీని అవమానపరిచిన వారిని వెంటనే శిక్షించాలి

Published: Thursday October 06, 2022

మంచిర్యాల టౌన్, అక్టోబర్ 04, ప్రజాపాలన: గాంధీని అవమానపరిచిన వారిని వెంటనే శిక్షించాలని వైశ్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీని కలకత్తాలో హిందూ మహాసభ పేరిట ఏర్పాటు చేసిన మండపంలో దుర్గామాత విగ్రహం వద్ద మహిషాసురుని స్థానంలో మహాత్ముని పోలిన బొమ్మను ఉంచడం సరికాదని  అన్నారు, ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ   ముక్త శ్రీనివాస్, ఆవోప   సిరిపురం శ్రీనివాస్,   మాదంశెట్టి సత్యనారాయణ, కొండ చంద్రశేఖర్ , పట్టణ   దొంతుల ముఖేష్ ,వాసవి   కంభంపాటి కమలాకర్ ,   కేశెట్టి వంశీకృష్ణ ,సాయిని సత్యనారాయణ  తదతరులు పాల్గొన్నారు.