డివిజన్లో పార్కుల అభివృద్ధికి కృషి

Published: Wednesday September 22, 2021
కార్పొరేటర్ రమ వెంకటేష్ యాదవ్
మేడిపల్లి, సెప్టెంబర్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్లో పార్కుల అభివృద్ధికి కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ గుర్రాల రమ వెంకటేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్లోని జ్యోతి నగర్ కాలనీలో పార్క్ పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు స్వామి, మాజీ అధ్యక్షులు తోట నర్సింహ రవి భాస్కర్ యాదవ్ పరమేష్ భాస్కర్ నర్సింగ్ రాజు జాంగిర్, సత్తి మరియు మహిళలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.