దేవాలయ భూములను కాపాడాలని వినతి మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)
Published: Wednesday November 30, 2022
రామంతాపూర్ డివిజన్లో దేవాలయ భూములను కాపాడాలని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు తెలంగాణ దేవాదాయ ధర్మదాయా శాఖ కమిషినర్ అనిల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. డివిజన్లోని శ్రీనగర్ కాలనీ, శ్రీ రామ కాలనీల మధ్యలో వున్న దేవాలయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి అసాంఘిక కార్యక్రమాలతో పాటు గంజాయి సేవిస్తున్నారని, బస్తి వాసులను ప్రతి రోజు బ్రయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. డివిజన్లో ఉన్న అన్ని దేవాలయ భూములకు హద్దుబందు ఏర్పాటు చేసి, నిరూపుయోగంగా ఉన్న భూములను ప్రజలకు అందుబాటులోకి తేవాలని కార్పొరేటర్ కమిషనర్ను కోరారు. వెంటనే స్పందించిన కమిషనర్
తమ బృందంతో రామంతాపూర్ కు వచ్చి దేవాలయ భూములను కపాడుతామని హామీ ఇచ్చారని కార్పొరేటర్ తెలిపారు.
Share this on your social network: