భవనిర్మాణ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పిట్టల సమ్మయ్య....

Published: Thursday December 01, 2022

శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన పిట్టల సమ్మయ్యను భవనిర్మాణ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నియమించినట్లు జాతీయ ప్రధాన కార్యదర్శి  విజయన్ కుర్షియన్, ఉప ప్రదాన కార్యదర్శి  మరుగొని ప్రవీణ్ కుమార్ తేలిపారు. కేంద్ర ప్రభుత్వం భవనిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదని 26 ఏళ్లుగా పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయములో పనులు లేక భవనిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారన్నారు రాజమండ్రిలో నవంబర్ 26 నుండి 28 వరకు జాతీయ మహాసభలు జరిగాయి అన్నారు ఈ మహాసభలో తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పిట్టల సమ్మేను జాతీయ కౌన్సిల్ నియామకం చేసిందన్నారు తనని నియామకానికి కృషి చేసిన రాష్ట్ర నాయకులు రమేష్, మారగోని ప్రవీణ్ కుమార్ ,కరీంనగర్ జిల్లా నాయకులు సమ్మయ్య, బుచ్చన్న యాదవు లకు కృతజ్ఞతలు చెప్పారు