వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ

Published: Tuesday June 14, 2022

మంచిర్యాల టౌన్, జూన్ 13, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ సమీకృత బాలుర వసతి గృహంలో చేరేందుకు 3వ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి సాయి లచ్చన్న తెలిపారు. విద్యార్థులు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, బోనాఫైడ్, కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వసతి గృహంలో చేరే విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్, దుస్తులు, షూస్, చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్ షీట్లు, కార్పెట్, ట్రంక్ పెట్టె అందిస్తామని ఆయన తెలిపారు.