ఆందోల్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను సత్కరించిన -డిపిఆర్ఇ- తుమ్మలపల్లి జగదీశ్వర్

Published: Friday November 26, 2021
సంగారెడ్డి జిల్లా 25 ప్రజాపాలన : ఆందోల్ పంచాయతీ రాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను సత్కరించిన సంగారెడ్డి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ తుమ్మలపల్లి జగదీశ్వర్. ఆందోల్ పంచాయతీ రాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అంజయ్య తాల్క బుధవారం నాడు అదనపు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి జిల్లా పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో బేస్తవారం నాడు తుమ్మలపల్లి జగదీశ్వర్ ఆద్వర్యంలో ఆందోల్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తులసి రాం సింగ్, డివిజన్ అకౌంట్స్ అధికారి రవిందర్, అసిస్టెంట్ ఇంజనీర్ కోటేశ్వరరావు, డివిజన్ సాంకేతిక అధికారి శేష శాయి మరియు డివిజన్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.