దరఖాస్తు చేసుకున్న.అర్హులైన వారందరికీ అసర పింఛన్లు మంజూరు చేయాలి వైయస్సార్ తెలంగాణపార్టీ

Published: Friday September 23, 2022
మంచాల మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ వృద్ధులు వితంతులు వికలాంగులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఏండ్లు గడుస్తున్నా పింఛన్లు మంజూరు చేయక పోవటం సిగ్గు చేటు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పు కోవటానికి పింఛన్లు మంజూరు చేస్తున్నాం అని కొంత మంది పేర్లు ఆన్ లైన్ చేసి పింఛన్లు మంజూరు చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఇంకా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులైన వారు చాలా మంది లబ్ది దారులు ఉన్నారు  ఎంపీడీవో కార్యాలయం అధికారులు కొంత మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు లు పక్కన పెట్టి నిర్లక్ష్యం చేయటంతో ఆన్ లైన్ చేయక పోవటంతో కొత్తగా మంజూరు అయిన పింఛన్ల లిస్ట్ లో పేర్లు లేక పోవటంతో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మా పేర్లు ఎందుకు రాలేదు అని ఆందోళన చెందుతున్నారు అధికార పార్టీ నాయకులు పైరవీలు చేసినా వాళ్ళకే పింఛన్లు మంజూరు చేస్తారా మూడు ఏండ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పింఛన్లు మంజూరు కావు మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు పింఛన్లు మంజూరు ఎలా అయ్యాయి అర్థం కావటం లేదు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దరఖాస్తు చేసుకున్న వరందరివి ఆన్ లైన్ చేయకుండా  కొంత మందివే ఆన్ లైన్ చేసి దరఖాస్తు లు పక్కన పడేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరివి ఆన్ లైన్ చేసి పింఛన్లు మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దరఖాస్తు చేసుకున్న వారందరి తొ కలిసి  ఎంపీడీవో కార్యాలయని ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నాం 
 
 
 
Attachments area