ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే

Published: Friday July 08, 2022
బెల్లంపల్లి జూలై 7 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండలం సోనాపూర్ గ్రామానికి చెందిన, దేవ్ బాయ్ కి 60 వేల రూపాయలు, అలాగే కన్నెపల్లి మండలం వీరాపూర్ కు చెందిన సోమ్ల చంద్రుమేరాకు 34, 500 ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురువారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లబ్ధిదారులకు అందించారు.
ఈ కార్యక్రమంలో కాసిపేట రైతు బంధు సమితి అధ్యక్షులు పోశం, మాజీ జెడ్పిటిసి సత్తయ్య, కన్నెపల్లి మండలం యూత్ నాయకులు జిల్లెల  మహేష్, తదితరులు పాల్గొన్నారు.