అన్నారుగూడెం పాఠశాలలో బాలల దినోత్సవం..

Published: Tuesday November 15, 2022
తల్లాడ, నవంబర్ 14 (ప్రజాపాలన న్యూస్): 
 మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని  పురస్కరించుకొని సోమవారం బాలల దినోత్సవాన్ని సోమవారం మండలంలోని అన్నారుగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రమేష్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నెహ్రూ చేసిన సేవలను పిల్లలకు వివరించారు.  నెహ్రు జయంతిని బాలల దినోత్సవం గా జరుపుకుంటారని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యను బోధించి ఆకట్టుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.