*కైకాల మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు*
Published: Saturday December 24, 2022
మధిర డిసెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) సినీ నటుడు కైకాల సత్యనారాయణ అకాల మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని సాయి ప్రసన్న ఆంజనేయ కళాపరిషత్ భక్తమండలి వారు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు పుణ్యవతి శుక్రవారం ఒక ప్రకటనలో సతాపం తెలిపారు. కైకాల సత్యనారాయణ జూనియర్ ఆర్ట్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి అంచలంచగలగా ఎదిగి అనేక పాత్రను పోషించి నవరస నటనా సార్వభౌమ అవార్డును సొంతం చేసుకున్నారన్నారు. కైకాల సత్యనారాయణ విభిన్న పాత్రల్లో ఒదిగి, మెప్పించి సహజ నటన ద్వారా అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కైకాల కుటుంబ సభ్యులకు వారు సానుభూతి తెలిపారు.
Share this on your social network: