ఐక్య కార్యాచరణ తోనే బీసీల హక్కులు సాధించుకోవాలి. ..అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్
Published: Wednesday October 26, 2022
జన్నారం, అక్టోబర్ 25, ప్రజాపాలన:
బిసిలు ఒకటిగా ఉండి ఐక్య కకార్యాచరణ తో తమ హక్కులను సాధించుకోవాలని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య, అన్నారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బందు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొక్క బీసీ కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరారు. బిసి బందు ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అయన హెచ్చరించారు. 8 సం,ల టిఆర్ఎస్ పాలనలో బిసిలకు ఒరిగిందేమి లేదని విమర్శించారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం బీసీ కులాలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. ఇప్ప టికైనా బిసి వ్యతిరేక చర్యలు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తుమన్నారు.
Share this on your social network: