విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి. మంచిర్యాల టౌన్, నవంబర్ 10, ప్రజ
విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని గురువారం చలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమం బి సి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల ఫీజు బకాయిలు రూ.3000 కోట్లు వెంటనే చెల్లించి 2008 సంవత్సరంలో ప్రవేశపెట్టిన స్కీము యధాతధంగా అమలు చేయాలి కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1500 నుండి రూ.3000 వరకు పాఠశాల హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను నెలకు రూ. 1100 నుండి రూ.2000 వరకు పెంచాలి విదేశీ విద్యార్థులు అందరికీ రూ.20 లక్షల స్టై ఫండ్ మంజూరు చేయాలి బీసీ కాలేజీ హాస్టల్ లకు గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేసి బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్ ను 200 కోట్లకు పెంచి ఎక్కువ మంది కి కోచింగ్ ఇవ్వాలని జూనియర్ అడ్వకేట్ లకు ఇచ్చే స్టై ఫండ్ రూ.1000 నుంచి రూ.10000 స్టై ఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సల్మాన్, అఖిల్, నిఖిల్, అనిరుద్, వేణుగోపాల్,రాజేష్ , నవీన్, శ్రవణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: