రైతుల పక్షాన తెరాస నాయకులు ధర్నా...

Published: Tuesday April 05, 2022

బీరుపూర్, ఏప్రిల్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో తెరాస నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో మండల రైతుల పక్షాన ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ముప్పాల రాంచందర్ రావు కొలముల రమణ తెరాస మండల అధ్యక్షుడు నారపాక రమేశ్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు నల్ల మహిపాల్ రిక్కల ప్రభాకర్ పర్వతం రమేష్ చుంచు శారద ఎలగందుల లక్ష్మీ ఘర్షకుర్తి శిల్ప వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తెరాస గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.