నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పరిశీలన : ఎం.పీ.డీ.వో

Published: Wednesday May 11, 2022

రాయికల్, మే 10 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో మండల ప్రజా పరిషత్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న ఎం.పి.పి.ఎస్. పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి గంగుల సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ ఉమామహేశ్వర రావు, గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ లు పరిశీలించారు. అనంతరం భూపతిపూర్, రామాజీపేట్ నర్సరీలను ఎం.పీ.డీ.వో సంతోష్ కుమార్ సందర్శించి, వేసవి కాలం కావటంచేత మొక్కల పెంపకం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూపతిపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, రామాజీపేట గ్రామఎక్స్ ఎం.పి.టి.సి బెజ్జంకి మోహన్ మరియు గ్రామ కార్యదర్శులు హరికృష్ణ, మహేష్ , ఫీల్డ్ అసిస్టెంట్ బెక్కెం సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.