_ ఘనంగా సంత్ సేవాలల్ 284వ జయంతి
Published: Thursday February 16, 2023
జన్నారం, ఫిబ్రవరి 15, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో సంత్ సేవాలల్ 284వ జయంతి కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం మండల కేంద్రంలోని బంజారా భవనానికి ఒక ఎకరం భూమి కేటాయించినందుకు మండల గిరిజనలు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజన తండాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కిందన్నారు. అందరూ సేవాలాల్ మహరాజ్ బాటలో పయనించి ఉన్నతస్థాయికి ఎదగాలని, ప్రతి ఒక్క బంజారా ప్రజలు ఒక్కటై అన్ని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా చూడాలన్నారు .అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గం పట్టణ కేంద్రానికి ఈనెల 20వ తేదీన మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, వస్తున్న సందర్భంగా పర్యటనను విజయవంతం చేయాలని జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గానికి జన్నారం పార్టీ నాయకులకు కార్యకర్తలకు భారీ మొత్తంలో రావాలని కోరారు. ఖానాపూర్ మండలంలోని లబ్ధిదారులకు అందజేసేందుకు మంత్రులు వస్తుందన్నారు. అనంతరం ఖానాపూర్ నియోజకవర్గం పట్టణంలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఆ సభను అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఇట్యాల కిషన్, మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, జిల్లా నాయకులు భరత్ కుమార్, ముత్యం సతీష్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బంజారా నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు._
Share this on your social network: