ఎర్రుపాలెం మండలం లో పలు శుభకార్యాల్లో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క....
Published: Friday May 20, 2022
ఎర్రుపాలెం మే 19 ప్రజా పాలన ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క మల్లు ఎర్రుపాలెం మండలం లో పర్యటించారు. ఎర్రుపాలెం, బనిగళ్ళపాడు గ్రామాల్లో జరిగిన వివాహాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ వివాహమన్నది అన్ని విషయాల్లో ఘనమైనది అని అవధులు లేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళా దుర్గా ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్లపల్లి సంతోష్, మదిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఐ ఎన్ టి సి మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి యువజన కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ, మధిర మండల పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు ఉన్నారు.
Share this on your social network: