రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
Published: Monday May 30, 2022
సర్పి మంత్రానికి వెళుతుండగా ఘటన.
మధిర మే 28 ప్రజాపాలన ప్రతినిధిి మండలం పరిధిలోో శనివారం నాడు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మాటూరు క్రాస్ రోడ్ వద్ద చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా, గంపలగూడెం మండలం, పేనుగొలను గ్రామానికి చెందిన పులిబండ్ల ధనలక్ష్మి 42మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. భర్త రంగారావుతో కలిసి ద్విచక్ర వాహనంపై తెల్లవారుజామున సుమారు ఐదు గంటల సమయంలో పెనుగోలను గ్రామం నుండి మధిర మండలం మునగాల గ్రామానికి సర్పీ మంత్రం నిమిత్తం వెళ్తుండగా మాటూర్ క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న గేదె ను ఢీకొనడంతో ధనలక్ష్మి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రంగారావు తీవ్ర గాయాలు కావడంతో మధిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు
Share this on your social network: