ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
Published: Tuesday June 22, 2021
బెల్లంపల్లి, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్ని బెల్లంపల్లి మునిసిపల్ ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు, సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఆయన ఎంతో కృషి చేశారని ఆయన కన్న కలలు నెరవేరక ముందే మరణించడం ఎంతో బాధాకరమైన విషయమని ఆయన సేవలను కొనియాడారు, ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వైస్ చైర్మన్ భత్తుల సుదర్శన్, పలువురు కౌన్సిలర్లు తెరాస నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: