బిజెపి జాతీయ నాయకులు పొంగులేటినీ కలిసిన యువనేత బీపీ నాయక్

Published: Tuesday June 14, 2022

బోనకల్, జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి: బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ గల్లా సత్యనారాయణ సారధ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు తమిళనాడు కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డిని, తమిళనాడు తిరువల్లూరు సీనియర్ బిజెపి నాయకులు శరణన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యువనేత బీపీ నాయక్ కలిశారు.అనంతరం నరేంద్ర మోడీ యాప్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు,ప్రస్తుత రాజకీయ విషయాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం బీపీ నాయక్ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి లాంటి అగ్రనాయకులు తమ హోదాను సైతం ప్రక్కన పెట్టి సహచర నాయకులతో పలు విషయాలను పంచుకోవడం సుధాకర్ రెడ్డి ఔనత్యాన్ని గొప్ప నాయకత్వాన్ని సూచిస్తాయని అన్నారు. ఇలాంటి గొప్ప సంఘటనలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వ నినాదం సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్ - సబ్ కా ప్రయాస్ ను బలపరుస్తాయని వెల్లడించారు. మున్ముందు రాబోయే రోజుల్లో సుధాకర్ రెడ్డి , గల్లా సత్యనారాయణ ఆదేశాలతో పార్టీ కార్యక్రమాల్లో పదును వేగం పెంచుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.