జెడ్పి బాలుర పాఠశాలలో పాఠ్య పుస్తకాలు పంపిణీ జెడ్పిటిసి అరిగేల నాగేశ్వర్ రావు

Published: Thursday July 07, 2022

ఆసిఫాబాద్ జిల్లా జులై 06(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జెడ్పిటిసి అరిగేల నాగేశ్వర్ రావు బుధవారం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగేల మల్లికార్జున్, సింగిల్విండో చైర్మన్, జిల్లా పోరం అధ్యక్షులు అలీ బిన్ అహ్మద్,గంధం శ్రీనివాస్, రహపెళ్లి సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు రాము గౌడ్, శ్రీశైలం, ముషీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.