20 న ఖమ్మంలో జరిగే టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టుల మహాసభలను జయప్రదం చేయండి రాష్ట్ర ఉపాధ్యక్

Published: Tuesday May 17, 2022

ఈ నెల 20న ఖమ్మంలో జరిగే టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ నారాయణ పిలుపు నిచ్చారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో జరిగిన టి యు డబ్ల్యూ జె ఐజేయూ సమావేశంలో ఈ సందర్బంగా రామ్ నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టి యు డబ్ల్యూ జె ఐజేయూ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టాలని కోరారు జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాటి పరిష్కారం కోసం యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు నేటికీ పనిచేయటం లేదని అన్నారు జాతీయ స్థాయిలో టీయూడబ్ల్యూజేఐజేయూ యూనియన్ గుర్తింపు పొంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అన్నారు జిల్లా మహాసభలకు రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు టి యు డబ్ల్యూ జె ఐజేయూ జాతీయ కార్యదర్శి ఈ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేఐజేయూ రాష్ట్ర జిల్లా నాయకులు నర్వ నేనే వెంకట్రావు శ్రీనివాసరెడ్డి వనం వెంకటేశ్వర్లు ఏనుగు వెంకటేశ్వరరావు సీ వీ ఆర్ శ్రీనివాసరావు ప్రసేన్ మురారి శ్రీనివాసరావు వైరా నియోజకవర్గ నాయకులు ఏపూరి రాజారావు ఎక్కిరాల శ్రీనివాసరావు గద్వాల రవీందర్ దాసరి శ్రీనివాసరావు మోటపోతుల బాబురావు సూత కాని శ్రీకాంత్ పులి కృష్ణ అర్జున్ అతావుల్లా ప్రశాంత్ అశోక్ మావిళ్లపల్లి విజయ్్్     మచ్్చ. యోగానందరావు   గో ల్లమందల బాబు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు ప్రతినిధులు పాల్గొన్నారు