జమలాపురం ఆలయ అర్చకులు హార్ట్ స్ట్రోక్ తో ఆకస్మిక మృతి

Published: Monday November 29, 2021
ఎర్రుపాలెం, 27. ప్రజాపాలన ప్రతినిధి జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు గా పనిచేస్తున్న ఉప్పలప్రభాకర శాస్త్రి శుక్రవారం గుండెనొప్పితో ఆకస్మికంగా మృతి చెందారు. మధ్యాహ్నం ఛాతిలో నొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మైలవరం వద్ద మృతి చెందారు. ప్రభాకర శాస్త్రి మరణ వార్త తెలియగానే ఆలయ అర్చకులు, సిబ్బంది శోక సముద్రంలో మునిగిపోయారు. ఆలయ ఈవో కొత్తూరు జగన్ మోహన్ రావు, చైర్మన్ ఉప్పల కృష్ణమోహన్ శర్మ, మాజీ చైర్మన్ వెంకట జయదేవ శర్మ, ప్రభాకర శాస్త్రి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రభాకర శాస్త్రి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపినఅన్ని పార్టీ నాయకులు ప్రముఖులు తెలిపారు.