ఉప్పల్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి
Published: Saturday December 17, 2022
ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కార్పొరేటర్
మేడిపల్లి, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి తెలిపారు.ఒకవైపు భారీగా నిధులను రాపడుతూ మరోవైపు కాలనీలో అభివృద్ధి పనులను చేపడుతూ సమస్యలను పరిశీలిస్తున్నామని కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.ఇప్పటికే రూ.2.40 కోట్ల సీఆర్ఎంపీ నిధులతో న్యూ శాంతినగర్ హనుమాన్ ఆలయం నుండి సరస్వతి కాలనీ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.సాయిబాబా కాలనీలో రూ.59.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి,కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఇప్పటికే కాలనీలో 18 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గరిక సుధాకర్, ఉప్పల్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, స్వీట్ హౌస్ రాజు, నాయాబ్ వెంకట్ రావు ,గుర్రాల వెంకటేశ్వర్ రెడ్డి , వేముల వెంకట్ రెడ్డి, పంగ మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, గొరిగే ఐలేష్ ,బడే అంజయ్య, ,ప్రభాకర్ , సల్ల సందీప్ రెడ్డి, సాయి బాబా కాలనీ అధ్యక్షులు అంజి రెడ్డి ,దేవి రెడ్డి ,రత్నం ,సత్తి రెడ్డి ,రమాకాంత్ రెడ్డి , బిక్షపతి ,సురేష్ ,చంద్ర రెడ్డి ,రమణ రెడ్డి ,సుబ్భా రెడ్డి సువర్ణ ,ప్రేమలత ,కోమల ,మల్లేష్ , స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: