హోమియో శిబిరాన్ని ప్రారంభించిన ఛైర్మన్ ప్రదీప్ రెడ్డి..
Published: Wednesday March 01, 2023
తల్లాడ, ఫిబ్రవరి 28 (ప్రజా పాలన న్యూస్):
మండల పరిధి కుర్నవల్లిలో మంగళవారం ఏర్పాటుచేసిన ఉచిత హోమియోపతి వైద్య శిబిరం విజయవంతమైంది. స్థానిక సర్పంచ్ ఆయిలూరి లక్ష్మి, సొసైటీ చైర్మన్ ఆయిలూరి ప్రదీప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమియోపతి వైద్యులు డాక్టర్ నీలిమ, శ్రీనివాస్ నాయక్ ,దీపిక రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోతురాజు వెంకటయ్య, ప్రధానోపాధ్యాయుడు సేలం శ్రీనివాస్ రెడ్డి, ఆయిలూరి శివారెడ్డి, ఆరోగ్య పాల్గొన్నారు.
Share this on your social network: