షేక్ లాల్ మహమ్మద్ అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం

Published: Monday January 09, 2023

 బోనకల్, జనవరి 8 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలో ని ఆళ్లపాడు గ్రామంలో నిరుపేద వృద్ధులు షేక్ లాల్ మహమ్మద్ జాన్ బీ లు గత 15సంవత్సరాల నుండి వారికి ప్రభుత్వం నుండి వృద్ధాప్య పింఛన్ రాని సందర్భంలో మాజీ సర్పంచ్ పారా నారాయణరావు సౌజన్యంతో ఆనాడు వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం నుండి పింఛను వచ్చేంత వరకు వారి ద్వారా ప్రతినెల 500 రూపాయలు 15 సంవత్సరాలు పాటు ప్రతినెల వారి ఇంటికి పంపించడం జరిగింది. వృద్ధుల్లో ఒకరైనటువంటి షేక్ లాల్ మహమ్మద్ (80) ఆదివారం మరణించినందున వారి అంత్యక్రియల కొరకు పారా నారాయణరావు మానవత్వం చాటుకొని వారి యొక్క ఆర్థిక వృద్ధాప్యాన్ని గుర్తించి చనిపోయినటువంటి వారి కుటుంబానికి వారి కుమార్తెలు, కుమారులు అంత్యక్రియల కోసం 6000 రూపాయలు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, శాఖ కార్యదర్శి బండి నాగేశ్వరావు పార్టీ నాయకులు షేక్ షరీఫ్ ఖాసీం సాహెబ్, పఠాన్ కరిముల్లా, షేక్ మస్తాన్ , షేక్ జానీ పారా వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని నారాయణ రావు ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని అందజేసీ వారి కుటుంబానికి ప్రాగాడ సానుభూతిని తెలియజేశారు.