షర్మిలమ్మ పాదయాత్ర తరలివెళ్లిన వైఎస్ఆర్ టిపి నేతలు

Published: Tuesday April 05, 2022
మధిర ఏప్రిల్ 4 ప్రజాపాలన ప్రతినిధి : ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ఈరోజు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం లోకి ప్రవేశిస్తుంది. వైయస్ షర్మిలమ్మ పాదయాత్రలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు నాయకత్వంలో పలువురు నాయకులు పలు వాహనాల్లో తరలివెళ్లారు. తరలి వెళ్లిన వారిలో చింతకాని మండలం అధ్యక్షులు వాకా వీరారెడ్డి నాయకులు సారిక కృష్ణప్రసాద్ కన్నేబోయిన రామకృష్ణ బి సత్యనారాయణ కాసిమాల శ్రీనివాస రావు జల్లేపల్లి చిన్న పుల్లయ్య నరేష్ లక్ష్మీ నరసయ్య తదితరులు ఉన్నారు