ఘనంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు

Published: Friday March 10, 2023
బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో గుర్రం నరేష్ గురు స్వామి వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రావినూతల శివాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు విఘ్నేశ్వరుడు కుమారస్వామి, అయ్యప్పస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. పంచామృత ఫలాభిషేకములు నూతన వస్త్రాలంకరణతో స్వామివారిని అందంగా అలంకరించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివార్లను ప్రత్యేకమైన రథంపై రావినూతల బోనకల్ స్టేషన్ గ్రామాల్లో ఊరేగింపు జరిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బోయినపల్లి కొండలు, మిర్యాల నాగేశ్వరరావు .వూట్ల నిఖిల్. వట్టి కొండ కార్తీక్.బానోతు గోపి. పుచ్చకాయల రాంబాబు, జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.