ప్రభుత్వ హాస్పిటల్ ల్లోనే సుఖ ప్రసవం : డా.శశిధర్ పిహెచ్సి దెందుకూరు

Published: Tuesday October 19, 2021
మధిర, అక్టోబర్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం దెందుకూరు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పిహెచ్సి దెందుకూరు డా.శశిధర్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండీ వచ్చిన గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. అనంతరం కాన్పుకు సమయం ఐనవారిని అనగా డెలివరీ కీ దగ్గరలో ఉన్న వారిని మధిర ప్రభుత్వ హాస్పిటల్ నందు సుఖ ప్రసవసం కోసం వెళ్ళాలి అని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీ సరైన పోషకాహారం తప్పక తినాలి అని, అన్ని వైద్య పరిక్షలు పిహెచ్సిలో చేయుంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పరివేక్షకులు సుబ్బలక్ష్మి, కాంతలీల, లంకా కొండయ్య స్టాఫ్ నర్స్ రజని ఎఎన్ఎం రాజేశ్వరి ఆరుణ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ సుఖ ప్రసవసం చేయుంచుకున్న వారికీ వెంటనే కెసిఆర్ కిట్టు అందజెస్తారు అని డా.శేషిధర్ చెప్పారు.