తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రముఖ వ్యాపారవేత్త రంగా హనుమంతరావు.

Published: Friday January 21, 2022
మధిర జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరావు పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానిికి ముందుగా వారి తండ్రి తల్లికి ఘనంగా సన్మానించి ఈ సందర్భంగా మాట్లాడుతూ కనిపించని దేవుళ్లు కంటే కనిపించే దేవుళ్లే మన తల్లిదండ్రులు. మనం ఏ స్థితిలో ఉన్న ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన కన్న తల్లిదండ్రులను గౌరవించడం అంటే ఆ తృప్తే వేరు. మనం ప్రతిరోజు ఎన్నో దేవుళ్ళు మొక్కుతాం కానీ ఆ దేవుళ్ళ కంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే దేవుళ్ళతో సమానం అని భావించుకోవాలి దానికి నిదర్శనమే ఈ రోజు మధిర లో వ్యాపార రంగంలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా తన కన్న తల్లిదండ్రులను గజమాలతో సత్కరించిన ప్రముఖ వ్యాపారవేత్త రంగా హనుమంతరావు దంపతులు. ఈరోజు ఆత్కూర్ క్రాస్ రోడ్ వద్ద వారు నూతనంగా ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకు ప్రారంభించటానికి ముందు వారి తల్లిదండ్రులు లను ఘనంగా గజమాలతో, శాలువాలతో సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్న రంగా హనుమంతరావు దంపతులు. ఈ సంఘటన చూసిన వారు అక్కడ ఎంతో ముచ్చట పడ్డారు. ఈ రోజుల్లో కొందరు వారి తల్లిదండ్రులను అనాధ శరణాలయంలో వదిలేస్తున్నారు. మరి కొంతమంది వారి ఆలనా పాలనా పట్టించుకోకపోవడం నిజంగా శోచనీయo. ఎవరికైనా తల్లిదండ్రుల దీవెనలు, ఆశీస్సులు ఉంటే వారి జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారని ప్రతి ఒక్కరు నమ్మాలి. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు దీవెనలు ఆశీస్సులు ఉంటే మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించినట్టే. వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు