అభివృద్ధిలో బడంగ్ పేట్ కార్పొరేషన్

Published: Wednesday June 23, 2021
బాలపూర్, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించిన కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 29 వ డివిజన్ కార్పొరేటర్ పెద్ద బావి శోభ ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం నాడు శంకుస్థాపన చేసిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు జాప్యం జరగకూడదని కాలనీల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు పూర్తవుతాయని ఆమె అన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి, డీ.ఈ అశోక్ రెడ్డి, ఏ.ఈ బిక్కు నాయక్, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.