దేవాలయం నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Tuesday April 27, 2021
గుమ్మడిదల, ఏప్రిల్ 26, ప్రజాపాలన ప్రతినిధి : దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సంపూర్ణ సహకారం ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తనవంతుగా లక్ష రూపాయల విరాళం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కులం మతం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు.