నారా లోకేష్ పాదయాత్ర మద్దతుగా బంజారా కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు మధిర జనవరి 27 ప్

Published: Saturday January 28, 2023
 పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ యువగళం* పాదయాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ బంజారా కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు రాష్ట్ర నాయకులు చేకూరి శేఖర్ బాబు కేక్ కట్ చేసి సంఘీభావం తెలియజేసినారు.
   ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న రాక్షస పాలన పై లోకేష్ బాబు ప్రజలందరికీ తెలిసే విధంగా చేపట్టిన 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్రను, కుల మత రాజకీయాలకతీతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు, కార్యదర్శి చెరుకూరి కృష్ణారావు, మహిళా  రాష్ట్ర కార్యదర్శి మేడేపల్లి రాణి, గడ్డం రమేష్, వనమా వెంకటి, చౌదరి గారు, బెంజిమెన్, నాగులవన్చ శ్రీనివాసరావు, గద్దల ప్రకాష్ రావు గారు, పగిడిపల్లి కాశి రావు, మన్నేపల్లి ,రత్నకుమారి, కొనీరు రాణి, స్వామి, చట్టు వెంకటేశ్వర్లు,