గ్రామంలో పర్యటించిన సర్పంచ్ మారెళ్ళ మమత..

Published: Thursday September 15, 2022
తల్లాడ, సెప్టెంబర్ 14 (ప్రజాపాలన న్యూస్): ఇటీవల కురిసిన వర్షంతో పాటు వాతావరణానికి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, వాటి పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత సూచించారు. బుధవారం ఆమె తల్లాడ వైద్య అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జ్వరాల బారిన పడ్డవారికి వైద్య అధికారులు చేత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇంటి పరిసరవాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అదేవిధంగా గాబుల్లో, డబ్బాల్లో నీరు నిల్వ ఉంటే పారబోయాలని సూచించారు. తల్లాడ ఆరోగ్య కేంద్రం డాక్టర్ గోపి, సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య, సీహెచ్ ఓ భాస్కర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు జ్వరాల సర్వే నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వేణు, తదితరులు ఉన్నారు.*