ఎస్ కెఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిని సందర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్

Published: Wednesday December 15, 2021

జగిత్యాల, డిసెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని ఎస్ కెఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సందర్శించినారు. అనంతరం కాలేజీలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించి సమస్యల పై ఆరా తీయగా తరగతి గదులు, మరుగుదొడ్ల సమస్య ఉన్నదని ఎమ్మెల్యే కు విద్యార్థులు వివరించగా ఎమ్మెల్యే నిధుల నుండి మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులను తక్షణమే మంజూరు చేస్తున్నానని నెలరోజుల లోపే నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు, తరగతి గదుల నిర్మాణం పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని హామీ ఇవ్వగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్, కౌన్సిలర్ అల్లే గంగ సాగర్, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అరిఫ్ నాయకులు భోగ ప్రవీణ్, వొద్ది రామ్మోహన్ రావు, సుమన్ రావు తదితరులు పాల్గొన్నారు.