పలు కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Friday February 26, 2021
మధిర ఫిబ్రవరి 25 ప్రజా పాలన ప్రతినిధి: మొదటిగా మందడపు కుటుంబరావు గారు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం కనక పూడి రత్నమ్మ గారు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం గుమ్మా పద్మాగారు ఇటీవల మరణించటంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం కృష్ణాపురం గ్రామం లో తేజావత్ సోమ్లా గారి భార్య ఇటీవల మరణించడంతో వారిని పరామర్శించారు అనంతరం మదిర లో నూతనంగా ఏర్పాటు చేసిన flipkart ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చితారు నాగేశ్వరరావు, మధిర టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, సిరిపురం సర్పంచ్ కనక పూడి పెద్ద బుచ్చయ్య, కర్నాటి శ్రీనివాస రావు, సిరిపురం మాజీ సర్పంచ్ చావా వేణు, వంగవీటి సర్పంచ్ బొగ్గుల పద్మ, కృష్ణాపురం సర్పంచ్ బుర్రి సునీత, రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్, టిఆర్ఎస్ మదిర నియోజకవర్గ యువజన నాయకులు కోన నరేందర్ రెడ్డి, వెంకటాపురం ఉపసర్పంచ్ హరికిరణ్ తదితర టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
Share this on your social network: