బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత బదిలీ నూతన కమిషనర్ గా గోపు గంగాధర్

Published: Wednesday June 08, 2022

 

బెల్లంపల్లి జూన్ 7  ప్రజా పాలన ప్రతినిధి:
 
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ లో ప్రస్తుతం పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, మున్సిపల్ కమిషనరేటు కు బదిలీ కాగా, ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా, భీంగల్ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న, గోపు గంగాధర్,ను బెల్లంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గా బదిలీ చేస్తూ, తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద కుమార్ సోమవారం నాడు ఉత్తర్వులు విడుదల చేశారు.
 
బెల్లంపల్లి లో పనిచేస్తున్న జంపాల రజిత, స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మరియు ఎమ్మెల్యే చెప్పినట్లుగా వినడం లేదని, ఈమెను మున్సిపల్ కమిషనర్ రేట్ కు సరెండర్ చేయాలని నిర్ణయించుకుని, పథకం ప్రకారమే ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులను కలిసి తక్షణమే బదిలీ చేయించినట్లు, స్థానికంగా ప్రచారం జరుగుతోంది.