జై జవాన్ కై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

Published: Thursday October 06, 2022
జన్నారం, అక్టోబర్ 04, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మంద మోక్షరాణి రెండు కిడ్నీలు చెడిపోవడమే కాకుండా కడుపులో అవస్థతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స కోసం లక్షల అప్పు చేశారని ఈ విషయం తెలుసుకుని మంగళవారం జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు ఆద్వర్యంలో మెాక్షరాణి కుటుంబానికి రూ, 5000/- ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మంద రాజేష్ మాట్లాడుతూ జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల ఉదయ్ కుమార్ (ఆర్మీ), ఫౌండేషన్ సభ్యుల సహకారంతో ఈ సహాయం చేయడం జరిగిందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మన కర్తవ్యామని, యువకులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని, దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సహాయము చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు భవాండ్లపెళ్లి హేమంత్ చారి, కొండూకురి ప్రభుదాస్, మామిడిపెళ్లి రాహుల్, రాజేందర్, ప్రమోద్, గ్రామస్తులు కస్తూరి దుబ్బాయ, తదితరులు పాల్గొన్నారు.