తాతా మధు గెలుపు సంబరాలు.....

Published: Wednesday December 15, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని ఎర్రుపాలెం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ తాతా మధుసూదన్ విజయాన్ని కాంక్షిస్తూ మండల కేంద్రంలో గల టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నందు బాంబులు కాల్చి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ విజయాన్ని కెసిఆర్ గారికి ఖమ్మం జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్నట్లు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు మొగలి అప్పారావు యాదవ్, మండల యువజన యువజన అధ్యక్షులు కొండ పాక సాంబశివరావు, ఎర్రుపాలెం ఎంపీటీసీ షేక్ మస్తాన్ వలీ, కత్తులు, పెద్ద గోపవరం ఎంపీటీసీ కిషోర్ బాబు, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు దేవరకొండ రవి, షేక్ హుస్సేన్, చొప్పకట్లపాలెం కార్యదర్శి పలకంటి సుధీర్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.