ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

Published: Wednesday September 22, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో నూతన టిఆర్ఎస్ గ్రామ అధ్యక్ష కార్యదర్శుల నియామక ఎన్నికలు జరుగగా అధ్యక్షులు డొంకనిబాలు గౌడ్, ఉపాధ్యక్షుడు మంత్రి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి అంకిల్ల నవీన్ రెడ్డి, కోశాధికారి వినయ్ గౌడ్, సంయుక్త కార్యదర్శి దోర్నాల రాము తదితరులు ఎన్నికైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మాకు బాధ్య తలు అప్పగించినందుకు మండల పార్టీ నాయకుల ఆదేశాల మేరకు శక్తివంచన లేకుండా పని చేస్తామని వారు తెలిపారు. ఈసందర్భంగా రాయపోల్  గ్రామ శాఖ అధ్యక్షుడు డొంకని బాలు గౌడ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ రాయ పోల్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. టిఆర్ఎస్ రాబోయే రోజుల్లో  రాయపోల్ గ్రామం మరింత పుంజుకుంటుందని, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో మరోసారి పరిపాలనలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.