తీజ్ పండగ జరుపుటకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి విరాళం అందించారు

Published: Saturday August 20, 2022
ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 19ప్రజాపాలన ప్రతినిధి  కోర్రవాని తండా తీజ్ పండుగకు మర్రి నిరంజన్ రెడ్డి గారికి ఆహ్వానించడం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల పరిధిలోని కోర్రవాని తండాలో ఈనెల 25వ తేదీన లంబాడ సోదరులు జరుపుకునే తీజ్ పండుగకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు, లంబాడా సోదరుల ఆరాధ్య దైవంగా కొలుచుకునే భవాని అమ్మవారు, సేవాలాల్ మహారాజ్  పూజ కార్యక్రమానికి మర్రి నిరంజన్ రెడ్డి  33333/- రూపాయలను కొర్రవాని తండా పెద్దలు మరియు కమిటీ సభ్యులకు అందజేశారు, ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ లంబాడ సోదరులు వ్యవసాయ పనులు వరినాట్లు విత్తనాలు పనులు తీరిన తర్వాత పంటలు బాగా పండాలని గొప్పగా నిర్వహించేదే ఈ తీజ్ పండుగ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో, సిరిసంపదలతో,  సుభిక్షగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కోర్రవాని తండా వాసులు చంటి,    ఉజాల, కోటి ,సీతారాం, గణపతి, మోతు, మహేష్, మోహన్, సుమన్, జగదీశ్, శ్రీకాంత్, రాజు, వినయ్ తదితరులు ఉన్నారు.