వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు

Published: Saturday September 03, 2022

కౌన్సిలర్లు ప్రభావతి సురేష్ గౌడ్ అనంత్ రెడ్డి

వికారాబాద్ బ్యూరో 02 సెప్టెంబర్ ప్రజా పాలన : సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లు అందజేసి ఆర్థిక చేయూత అందజేస్తున్నారని 23వ వార్డు కౌన్సిలర్ కలాల్ ప్రభావతి సురేష్ గౌడ్ 15వ వార్డ్ కౌన్సిలర్ చిట్యాల అనంతరెడ్డి సంయుక్తంగా తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో 23వ వార్డులోని 49 మందికి ఆసరా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోవృద్ధులకు సీఎం కేసీఆర్ నేను మీకు తోడు ఉన్నానంటూ భరోసా కల్పించారు అని పేర్కొన్నారు. ఇంతవరకు మీరు కుటుంబ భారాన్ని మోసి అలసిస్ వలసిన ఆశాజీవులు మీరని స్పష్టం చేశారు. వయసు మీద పడ్డారని కుటుంబ సభ్యులు మిమ్మల్ని చీదరించుకోకుండా ఉండేందుకు ఆర్థికంగా ఆదుకుంట సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలని గుర్తు చేశారు. వృద్ధాప్యంలో ఉన్న మీకు మీ పిల్లలే మిమ్మల్ని డబ్బులు అడిగే పరిస్థితి నేడు కూడా వస్తుందని ఎవరు అనుకోరు. నాలుగు రాళ్లు వయోవృద్ధుల వద్ద ఉంటే మనవడో మనవరాలో కొడుకో కోడలో మీకు చేయి చాచాల్సిందేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చింత కింది జగన్ ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి 23వ వార్డు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.