ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 28ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday October 29, 2022

* ప్రమాదకరంగా  ఒరిగిన విద్యుత్ స్తంభం నిర్లక్ష్యంతో విద్యుత్ అధికారులు*


రంగారెడ్డి జిల్లా,ఇబ్రహీంపట్నం,ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో మంచాల రోడ్డు వైపుగా వెళ్లే మార్గంలో బస్ స్టాప్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా రోడ్డుపైకి ఒరిగి ఉండడాన్ని గమనించిన స్థానికులు పలుమార్లు విద్యుత్ అధికారులకు సంప్రదించగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భయాందోళనలకు గురవుతున్న అటుగా వెళ్లే ప్రయాణికులు అక్కడ షాపులు నిర్వహిస్తున్న దుకాణదారులు భయంతో సముదాయాల్లో షాపులు నిర్వహిస్తున్నట్లు పూర్తిగా బహిరంగ ప్రదేశం కాకపోవడంతో రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను తీర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు మొద్దు నిద్ర వదిలి సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.